మంత్రి కేటీఆర్‌పై డీకే అరుణ ఫైర్‌.. భ్రమలో ఉన్నారంటూ..

-

తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన క్రెడాయ్ సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ.. ఆంధ్రలో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించడంపై డీకే అరుణ స్పందిస్తూ.. శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

Aruna slams TRS government for ignoring pending projects

కేటీఆర్ తన మిత్రుడు ఎవరో చెప్తే, తాను స్వయంగా అతడిని గద్వాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తీసుకొని వెళ్ళి, అక్కడ రోడ్లు, నీటి, విద్యుత్ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానని ఆమె వ్యాఖ్యానించారు. కేటీఅర్ స్నేహితుడు కేవలం కల్వంకుంట్ల వారి ఫార్మ్ హౌస్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసి , మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా ఉంటుందన్న భ్రమలో ఉన్నటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. దానికి తోడు కేటీఅర్ సొంత డబ్బా కొట్టుకోవడంలో సిద్ధ హస్తుడన్న విషయం యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసన్న విషయం కేటీఅర్ మర్చినట్టు ఉన్నారని డీకే అరుణ చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news