డీఎంకేకు షాక్‌…రాజ్యసభ MP కుమారుడు మృతి

-

డీఎంకే పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. డీఎంకే రాజ్య సభ సభ్యుడు ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు రాకేశ్‌ ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 22 సంవత్సరాల రాకేష్‌ పుదుచ్చేరి నుంచి మరో వ్యక్తితో కలిసి చెన్నై వెళుతుండగా… కారు అదుపు తప్పి.. డివైడర్‌ ను ఢీ కొట్టింది.

ఈ సంఘటన లో డీఎంకే రాజ్య సభ సభ్యుడు ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు రాకేశ్‌.. అక్కడిక్కడే మరణిం చారు. అంతేకాదు.. రాకేష్‌ సహా… ఆయనతో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో వారి కారు నుజ్జు నుజ్జు అయింది.

ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సాయంతో.. కారును తొలగించి.. ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేశారు. ప్రమాదానికి సంబంధించి.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు ఈ ఘటన తమిళనాడు సీఎం స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. మాజీ సీనియర్‌ న్యాయవాది ఆయిన ఇళంగోవన్‌ 2020 నుంచి రాజ్యసభలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news