మెదడు చురుకువ్వాలంటే డైలీ ఉదయాన్నే ఇలా చేయండి..!

-

ఉదయం లేవడమే చిరాకుగా లేస్తే..ఆరోజు అంతా అలానే అనిపిస్తుంది. లేచినప్పుడు మనకు ఉండే మానసిక స్థితిని బట్టి ఆ రోజు ఎలా ఉండబోతుందో తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అందుకే ఉదయాన్ని పాజిటివ్ మైండ్ సెట్ తో ప్రారంభించాలట.
చాలా మందికి లేవగానే రోజువారీ పనులు, ఆర్థిక సమస్యలు గుర్తొచ్చి..మైండ్ అంతా డిస్టబ్ అయినట్లు అనిపిస్తుంది.. రోజులో చేయబోయే, జరగబోయే వాటి గురించే ఆలోచిస్తూ ప్రశాంతతను దూరం చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి రోజు లేవగానే ఇప్పుడు చెప్పుకోబేయో చిట్కాలు పాటిస్తే.. మెదడుకు సానుకూల సంకేతాలు అందుతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి ఉదయం ఏం చేయాలో చూద్దాం.

ఉదయాన్నే పుస్తకాలు, వార్తాపత్రిక చదవండి

చాలామందికి లేవగానే వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంటుంది. అయితే ఇది ఈమధ్య చాలామంది పాటించటంలేదు. పెద్దవారు మాత్రమే కాఫీ తాగుతూ అలా పేపర్ తిరగేస్తుంటారు. కానీ ఉదయం కనీసం 5నిమిషాలైనా..ప్రశాంతంగా..వార్తా పత్రికలు చదువుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మెదడు మరింత చురుగ్గా ఉంటుంది. అంతేకాదు, మిమ్మల్ని గత విషయాలకు, జరగబోయే విషయాలకు దూరంగా తీసుకెళ్లి మెదడుకు ప్రశాంతత కల్పిస్తాయి. పత్రికలు చదివటం ఇష్టం లేకుంటే..ఏదైనా బుక్ చదవండి.

ధ్యానం

ద్యానం చేయటం వల్ల..మనసుకు, మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. మనిషి భావోద్వేగాలు, భయాలు మెదడు కణాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. దీని వల్ల మెదడు పనితీరు నెమ్మదించడం, వాస్తవాలను అర్థం చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, స్పందించడంలో వెనుకబడటం లాంటివి జరుగుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత పెరుగుతాయి. ధ్యానం చేసేవాళ్లు ఏ విషయాన్నైనా తొందరగా గుర్తుకు తెచ్చుకోగలరు, నేర్చుకోగలరని ఇప్పటికే చాలా అధ్యయాల్లో తేలింది.

వ్యాయామం

వ్యాయామం శరీరానికి, ఆరోగ్యానికే కాదు.. మెదడుకూ మేలు చేస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనకు తెలియకుండానే… మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పలు న్యూరోట్రాన్స్‌ మీటర్స్‌ వ్యాయామం చేయడం వల్ల విడుదలవుతాయి. అలాగే మెదడుకు తగినంత ఆక్సిజన్‌ రక్తం ద్వారా సరఫరా అవుతుంది. మెదడును గరిష్ఠ స్థాయిలో పనిచేసే విధంగా చేస్తుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

సంగీతం

ఉదయం లేవగానే చక్కటి సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. మెదడులో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా సంగీతం మనిషి మానసిక స్థితిని మార్చేస్తుంది. మనకు నచ్చిన పాటలు వింటుంటే..మనసుకు సంతోషంగా అనిపిస్తుంది. సంగీతం వినే సమయంలో మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తడిని తగ్గిస్తుంది. ఒకే విషయంపై ఏకాగ్రత పెంచుకోవచ్చు. అల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధిత వ్యాధులను సైతం సంగీతం కొంతమేర నయం చేస్తుందట. అందుకే మూడ్ బాలేనప్పుడు అందరూ సాంగ్స్ వినటానికే ప్రాముఖ్యత ఇస్తారు.

మెదడుకు మేత

టైం ఉంటే..ఉదయాన్నే పదవినోదం, సుడోకు, పజిల్స్‌ వంటివి ఆడుతూ ఉండాలి. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవుతుందని..నిపుణులు అంటున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news