పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా : సీఎం జగన్

-

సీఎం వైఎస్ జగన్ ఎమ్మిగనూరు సిద్ధం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా చేపట్టలేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదలను పట్టించుకోని పాలకులు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధనికులకు అందే చదువు.. పేద విద్యార్థులు కూడా అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగాన్ని విస్మరించిన చంద్రబాబుకు ఓటేస్తారా అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. మీ ఓటుతోనే మీ పిల్లల భవిష్యత్ మారుతుందని అన్నారు.విద్యారంగంలో వచ్చిన మార్పులకు సంతోష పడుతున్నానంటూ.. మే 13న కురుక్షేత్ర యుద్దం జరగబోతుందన్నారు. 58 నెలల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.మా పథకాలు చూశారు.. ప్రభుత్వాన్ని చూసి రాఖీ కట్టండని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇళ్ల పట్టాలిచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పేద మహిళల కష్టాల నుంచి సంక్షేమ పథకాలు వచ్చాయనీ,మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఎమ్మిగనూరు సభలో వైఎస్ జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news