రూ.2వేల రూపాయల నోట్లను ఎక్కడ సులువుగా మార్చుకోవచ్చో తెలుసా?

-

మనదేశంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోట్లలో 2 వేల రూపాయల నోటు మొదటిది..2016 లో ఈ నోటు మార్కెట్ లోకి వచ్చింది.. డీమానిటైజేషన్ లో భాగంగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ పెద్ద నోటును ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ ఓ సంచనలన నిర్ణయం తీసుకుంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లను ఇవ్వటం ఆపేయాలని దేశంలోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది..

ఇక ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 లోపు ఈ నోట్లను మార్చుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది..ఎవరి బ్యాంకులలో వాళ్ళు తమ దగ్గర ఉన్న నోట్లను డిపాజిట్ చేసి వాటికి సమానమైన నోట్లను తీసుకోవచ్చునని ఆర్బీఐ సూచించింది..మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అలాగే దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు వివరించింది. ఒకవేళ, సెప్టెంబరు 30 లోపు ఆ పని చేయలేకపోతే ? ఆ తరువాత ఆ నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకుల్లో కాకుండా ఆర్బీఐ రీజినల్ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని బ్యాంక్ పేర్కొంది..

అయితే, బ్యాంకు సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోజుకు 20 వేల వరకు నోట్లను మార్చుకోవచ్చునని అధికారులు తెలిపారు..అదే డిపాజిట్ అయితే ఎంతైన చేసుకోవచ్చు. డిపాజిట్ చేసేందుకు పరిమితి లేదు..ఎలా మార్చుకోవాలంటే..

*. మే 23 నుంచి బ్యాంకుకు వెళ్లి రూ. 2000 నోట్ల ను మార్చుకోవచ్చు. అందుకోసం మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లాలి.
*. అక్కడ ఎక్స్ ఛేంజ్ రిక్వెస్ట్ స్లిప్ అని ఉంటుంది. దానిలో అడిగిన ఐడెంటిఫికేషన్ వివరాలు రాసి పూర్తి చేయాలి. ఆ తర్వాత రూ. 2000నోట్ల వివరాలు పొందుపరచాలి. ఎన్ని ఇస్తున్నారు ఏంటి అన్నది రాయాలి..
*. రోజూకు 20వేల వరకు మార్చుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news