ఉరి వేసుకుంటా అంటున్న బండి సంజయ్.. ఎందుకో తెలుసా..!

-

ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల పెద్దలు రంగంలోకి తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులూ ఇవ్వలేదు అంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుందని ఒకవేళ కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి నిధులూ రాలేదు అని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలోని ఉరి వేసుకుంటాను అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో గెలవాలని కెసిఆర్ కోరుకోవడం లేదని దుబ్బాక ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు అడ్డు తొలగిపోతే ఆ తర్వాత తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news