రాజమౌళి పై డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్..!

-

టాలీవుడ్ ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. కలే అనుకున్న ఆస్కార్ ని మన తెలుగు సినిమాకు సాధించి తీసుకొచ్చారు రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. బాహుబలితో పాన్  ఇండియా సినిమా రెండు పార్టులు అనే ఆనవాయితీని ప్రారంభించి.. RRR తో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి.. ఇలా పలువురు రాజమౌళి గురించి మాట్లాడారు. చివరో రాజమౌళి.. నేను కేవలం నా కథకు మాత్రమే బానిసగా ఉంటాను అని చెప్పడం గమనార్హం. ఈ డాక్యుమెంటరీ కోసం రాజమౌళి అభిమానులతో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news