అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డాక్టర్ సుధాకర్!

-

ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన డాక్టర్. సుధాకర్ నిన్న విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి హైకోర్టు ఆదేశాల మేరకు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. నగరంలోనే ఓ రహస్య ప్రాంతంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని డా.సుధాకర్ సన్నిహితులు తెలిపారు. ఐదు రోజుల వరకూ ఆయన ఎవరినీ కలువబోరని వారు వెల్లడించారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని ఆయన కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news