బడా బాబుల పిల్లలను అరెస్ట్ చేయరా…? పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుపై అసదుద్దీన్ ఓవైసీ

-

పుడింగ్ అండ్ మింక్ బార్ డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంజారాహిల్స్ లోని ఓ ఈబార్ లో రేవ్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో పోలీసుల రైడ్ చేశారు. బార్ లో డ్రగ్స్ ను కనుక్కున్నారు. దాదాపుగా వందకు పైగా మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సమాజంలో బడాబాబుల పిల్లలు ఈ ఘటనలో పోలీసులకు చిక్కారు.

Asaduddin

తాజాగా పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హైదరాబాద్ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. రేవ్ పార్టీలో కొకైన్ దొరకడం దురదృష్టకరం అని ఆయన అన్నారు. రూల్ ఆఫ్ లా అందరికి సమానంగా ఉండాలని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసులో పబ్ ఓనర్స్ ని మాత్రమే అరెస్ట్ చేస్తారా…  బడా బాబుల పిల్లలను అరెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. చట్టం ధనికులకు, పేదవారికి సమానంగా ఉండాలని ఆయన అన్నారు. కేటీఆర్, హైదరాబాద్ సీపీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news