దక్షిణ మధ్య రైల్వే కొత్త నిర్ణయం.. ఈ-ఆక్షన్‌

-

దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్‌ విధానాన్ని రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్‌ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్‌ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు. దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది రైల్వే బోర్డు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్‌ డివిజన్‌ ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది దక్షిణ మధ్య రైల్వే.

Secunderabad: South Central Railway review meet on safety, freight

అన్ని రకాల రాబడికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఈ–ఆక్షన్‌ ద్వారానే కేటాయిస్తారు. వాహనాల పార్కింగ్, పార్సిల్‌ సర్వీసులు, ఏటీఎంలు, ఏసీ వెయిటింగ్‌ రూమ్‌ సర్వీసు, క్లాక్‌ రూమ్‌ సర్వీసులు, రుసుము చెల్లింపు విధానంలో టాయిలెట్ల నిర్వహణ మొదలైన కాంట్రాక్టుల కేటాయింపునకు ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. అన్ని రకాల చెల్లింపులు ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్‌ ప్రక్రియను గరిష్టంగా 72 గంటల్లోగా పూర్తి చేస్తారు. ఈ–ఆక్షన్‌ ప్రక్రియకు బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నెల రోజుల్లోనే 220 మంది కాంట్రాక్టర్లు ఈ–ఆక్షన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు రూ.77.51 కోట్ల విలువైన 54 కాంట్రాక్టులను ఈ–ఆక్షన్‌ ద్వారా కేటాయించింది దక్షిణ మధ్య రైల్వే.

 

Read more RELATED
Recommended to you

Latest news