కవితను ఢిల్లీకి తీసుకెళ్లనున్న ఈడీ అధికారులు.. ఫ్లైట్ బుక్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు  తాజాగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈడీ అధికారులు కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు.

తొలుత కొద్ది సేపటి వరకు ఈడీ అధికారులు కేటీఆర్, హరీశ్ రావులను లోపలికి పంపించలేదు. తరువాత అనుమతించనున్నారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారని కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈడీ అధికారులు 8.45 గంటలకు ఫ్లైట్ బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించనున్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా.. అరెస్ట్ వారెంట్ లేకుండా ఢిల్లీకీ  ఎలా తీసుకెళ్తారని అధికారులను ప్రశ్నించారు కేటీఆర్. విచారణ అధికారినితో కేటీఆర్, హరీశ్ రావు వాగ్వాదానికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news