కరోనా పంజా.. యువ హీరో తండ్రి మృతి..!

-

సినీ రంగంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. టాలీవుడ్‌ నటుడు, ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్‌ మహమ్మారి కరోనా బారిన పడి మృతి చెందారు. గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి 8:30 గంటలకు తుది శ్వాస విడిచారు. 2012లో మారుతి తెరకెక్కించిన మొట్ట మొదటి సినిమా ఈ రోజుల్లో. అందులో హీరోగా నటించి శ్రీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

ఆ తరువాత పలు డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే కెరీర్ కి ఎంతగానో సపోర్ట్ చేసిన తండ్రి దురమవ్వడంతో శ్రీ తట్టుకోలేకపోతున్నాడు. ఆయన మరణ వార్త విని పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ఇటీవల పలువురు సీరియల్ యాక్టర్స్ కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలతో కొందరు ఆ వైరస్ నుంచి తప్పించుకుంటున్నారు. ఇక కొందరు సెలబ్రెటీలు ఊహించని విధంగా ప్రాణాలను విడుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news