హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ ఘన విజయం…

-

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హుజూరాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. దాదాపుగా 23,865 ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలుపొందారు. మొత్తంగా 2,05,236 ఓట్లు పోలైతే 1,01,732 ఓట్లు సాధించారు. దాదాపు 51.6 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వరసగా ఏడో సారి ఈటెల రాజేందర్  గెలుపొందారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఉపఎన్నికలు, 4 సార్లు సాధారణ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపొందారు. ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 82712 ఓట్లు వచ్చాయి. అభ్యర్థుల గెలుపోటములను కేవలం 9 శాతం ఓట్లు డిసైడ్ చేశాయి. పోటీలో ఉన్న మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ నామమాత్రంగా అయినా ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ పార్టీ పరిస్థితి ఇండిపెండెంట్లతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా విజయంతో రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news