ఏక్‌నాథ్‌ షిండే పార్టీ గుర్తుపై సిక్కు వర్గాల అభ్యంతరం

-

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై వివాదం చెలరేగింది. షిండే శివసేన గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన బాలాసాహెబ్‌ శివసేనకు రెండు కత్తులు, డాలుతో కూడిన గుర్తును ఈసీ కేటాయించింది. అయితే ఇది ఖల్సా పంత్‌కు సంబంధించిన మతపరమైన చిహ్నమని సిక్కులు అంటున్నారు. తమ మత గురువు శ్రీ గురు గోబింద్‌ సింగ్‌ కత్తీ, డాలును ఖల్సా పంత్‌ మతపరమైన చిహ్నంగా నిర్ణయించారని గురుద్వారా సచ్‌ఖండ్‌ బోర్డ్‌ మాజీ కార్యదర్శి రంజిత్‌ సింగ్‌ కంతేకర్‌ అన్నారు.

దీనిపై ఆయనతోపాటు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఆ గుర్తును ఎవరికీ కేటాయించకూడదని కోరారు. తమ అభ్యర్థనను ఈసీ పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన శివసేనకు (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) ఈసీ కాగడా గుర్తును కేటాయించింది. దీనిపై సమతా పార్టీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news