ఎడారి లాంటి ప్రాంతాల్లో నీరు పారిస్తున్న భగీరథుడు కేసీఆర్ : ఎర్రబెల్లి

-

ఎడారి లాంటి ప్రాంతాల్లో నీరు పారిస్తున్న భగీరథుడు కేసీఆర్ అని సీఎంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసలు కురింపించారు. మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఒకప్పుడు తండాలు, గ్రామాల్లో బిందెలు నెత్తి మీద పెట్టుకుని నీళ్లు మోసుకునే వాళ్లమని.. ఇప్పుడు బిందెలతో క్యూలు కట్టే రోజులు పోయాయని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. కేసీఆర్ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రతి ఇంట్లో నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. తండాల అభివృద్ధి కోసం వాటిని గ్రామ పంచాయితీలుగా మార్చారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.

40 ఏళ్లుగా తాను మహబూబాబాద్‭లోనే ఉన్నానని.. అప్పట్లో వ్యవసాయం చేసినప్పుడు నీళ్లు ఉండేవి కాదని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. ఎడారిలాంటి ప్రాంతాల్లో.. కేసీఆర్ దయవల్ల ఎండాకాలంలో కూడా చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా జలాలను ఫిల్టర్ చేసి జనం దాహార్తిని తీరుస్తున్నారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Latest news