కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎప్పడూ పోరాటం చేయలేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు

-

కాంగ్రెస్ ఎంపీలు ఎప్పుడైనా పార్లమెంట్ లో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమపై పోరాడింది లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలిపితే.. ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇవ్వలేదని ఎర్రబెల్లి విమర్శించారు. ఈ రోజు బీజేపీ వాళ్లను బహిష్కరిస్తే.. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మద్దతుగా మండలాల్లో దర్నాలు, నిరసనలు తెలిపారని విమర్శించారు. రాహుల్ గాంధీని బీజేపీ పార్టీ నోటికి వచ్చినట్లు తిట్టితే..సోయిలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలు చేసినప్పుడు మద్దతు తెలిపలేదని ఎర్రబెల్లి విమర్శించారు.

 

మీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో ధాన్యం ఎన్ని కొంటున్నారో రిపోర్ట్ తెప్పించుకోవాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం చత్తీస్గడ్ రాష్ట్రంలో వడ్లు, మక్కలు కొనడం లేదని.. అక్కడి ప్రజలు ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వచ్చి అమ్ముకుంటున్నారని.. నేనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి వంద లారీలు పట్టుకున్నామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news