జై తెలంగాణ అని అమిత్ షా ఎందుకు అనలే ? : మంత్రి ఎర్రబెల్లి

-

అమితా షా కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు అన్ని బోగస్ మాటలు అని… అబద్ధపు మాటలతో, బోగస్ మాటలతో బీజేపీ నెట్టుకొస్తుందని ఫైర్‌ అయ్యారు. భారత్ మాత్ కీ జై అని అందరు అన్నారు, జై తెలంగాణ అనలే అంటే వీళ్ళకు తెలంగాణపై ఎంత విశ్వాసం? ఉందో అర్థమౌవుతుందని నిప్పులు చెరిగారు. జై తెలంగాణ అని అమిత్ షా ఎందుకు అనలే అని నిలదీశారు. ఎన్నికల మానిఫెస్టో లో పెట్టిన హమీలు నేరవేర్చుతున్నామని.. మానిఫెస్టోలో లేనివి కూడా చేస్తున్నామని చెప్పారు.. బీజేపీ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టింది ఒక్కటైనా చేసారా ? అని నిలదీశారు.

కేసీఆర్ ఇండియాలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అని.. మిషన్ భగీరథ కోసం ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వలేదని ఆగ్రహించారు. తెలంగాణలో ఉపాధిహమీ పథకం నెంబర్ వన్ అని చెప్పి, అవార్డు ఇచ్చింది కేంద్రప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఉపాధి హమీ పథకం డబ్బులను 4 నెలలుగా ఇవ్వట్లేదని.. ల్యాండ్ ఇవ్వని రాష్ట్రాలకు గిరిజన యూనివర్సిటీలు,కోచ్ ఫ్యాక్టరీ లు ఇచ్చారు..ల్యాండ్ ఇచ్చిన మాకు మొండిచేయి చూపించారని నిప్పులు చెరిగారు.

తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని.. బండి సంజయ్ సింపతీ మీద గెలిచాడన్నారు, మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ అని ఆగ్రహించారు. పసుపు బోర్డు తెచ్చుకోలేనీ దద్దమ్మ ఎంపీ అరవింద్ అని.. బీజేపీ వాళ్ళు బ్లాక్ మెయిలర్లుగా తయారుయ్యారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి చేయకపోయినా పర్లేదు కానీ, చెడగొట్టడానికి తయ్యారయ్యారన్నారని ఫైర్‌ అయ్యారు. రైతులకు నష్టం చేసే చట్టాలు తీసుకువచ్చిన పార్టీ బీజేపీ అని… రైతుల ధర్నాతో దిగొచ్చి ప్రధాని మోడి క్షమాపణ చెప్పారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news