ఎర్రబెల్లికి మంత్రివర్గంలో కొనసాగే హక్కు లేదు – జీవన్ రెడ్డి

-

ఎర్రబెల్లి దయాకర్ రావుకి మంత్రివర్గంలో కొనసాగే హక్కు లేదని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేడు సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో సర్పంచ్ ల హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం సర్పంచ్లకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళి ఇస్తుందని.. సర్పంచ్ల హక్కులను కాలరాస్తుందన్నారు. కెసిఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చలేదని మండిపడ్డారు జీవన్ రెడ్డి. చెట్లు పెరగకపోతే సర్పంచులను సస్పెండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ లో ఖాతాల్లో ఉన్న నిధులను ట్రెజరీకి చూపించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news