పబ్బులకు వెళ్లిన రాహుల్..ఓయూకు వస్తే విద్యార్థులు చెడిపోతారు- మంత్రి ఎర్రబెల్లి

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత.. రాహుల్‌ గాంధీ రాత్రి పబ్‌ కు వెళ్లిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఖాట్మాండ్‌ లోని ఓ ప్రముఖ పబ్‌ కు వెళ్లాడు రాహుల్‌ గాంధీ. అయితే.. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనపై మంత్రి ఎర్రబెల్లి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో లక్షకు మించి జనాభా పట్టరని, రేవంత్ రెడ్డి 5 లక్షల మందితో సభ ఎలా నిర్వహిస్తారు అంటూ చురకలు వేశారు. వీలైతే రేవంత్ 500 ఎకరాల్లో సభ నిర్వహిన్చుకోవాలని సూచించారు.

ఇక ఉస్మానియా కు రాహుల్ గాంధీ వచ్చి పబ్బుల గురించి మాట్లాడితే విద్యార్థులు చెడిపోతారని ఎద్దేవా చేసారు… ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ఇవ్వడం ప్రభుత్వ పరిధి కాదని, యూనివర్సిటీ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉందని తెలిపారు. కాగా.. అటు జగ్గారెడ్డి కూడా పబ్‌ విషయంపై స్పందించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పెళ్లికి వెళితే తప్పేంటి అని నిలదీశారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news