FRO శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రబోడు గుత్తికోయలు

-

భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు చిత్రపటానికి నివాళులర్పించారు ఎర్రబోడు గొత్తికోయలు. రేంజర్ శ్రీనివాస్ తో తమకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పోడుభూముల విషయంలో క్షణికావేశానికి గురైన ఒకరిద్దరు చేసిన దాడిలోనే ఆయన మృతిచెందారని తెలిపారు. గ్రామం నుంచి పాలకవర్గం తమను బహిష్కరించడం బాధను కలిగిస్తోందని ఆవేదనకు గురయ్యారు.

తమను గ్రామంలోకి రానివ్వడం లేదని, ఆహారపానీయాలు లేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నామని వెల్లడించారు. ఒకరిద్దరు చేసిన తప్పుకు మమ్మల్నందరినీ నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. పోడుసాగే మాకు జీవనాధారమని.. ఈనేలను వదిలి వెళ్లం.. ఇక్కడే ఉంటాం ఇక్కడే చస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news