ఓటుకు టిఆర్ఎస్ రూ.50 వేలు పంచుతోంది : ఈటల రాజేందర్

-

ఓటుకు 20 వేల నుంచి 50 వేలు టిఆర్ఎస్ పార్టీ పంచుతుందట.. అవన్నీ అవినీతి తో సంపాదించిన సొమ్ము తీసుకోవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ ఓటు మాత్రం కమలానికే వేయాలని కోరారు ఈటల రాజేందర్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బత్తినివాని పల్లిలో మంత్రి ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఏది అడిగితే అది ఇస్తారట… తన మీద దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు ఈటల.

వాళ్ల నియోజక వర్గాలను పట్టించుకుని ఎమ్మెల్యేలు ఇక్కడ మాత్రం ఏదేదో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కూట్లే తీయలేనోడు.. ఏట్లో రాయి తీసినట్లుగా ఇక్కడ హామీ లిస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు సహా.. అనేక హామీలు ఇస్తున్నారంటే అవన్నీ తమ పై ప్రేమతో కాదని.. కేవలం మీ ఓట్ల కోసమే హామీలు అని చురకలు అంటించారు. దళిత బంధు లాగే.. అన్ని కులాల్లోని పేదలకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.

 

Read more RELATED
Recommended to you

Latest news