వరద సహయంపై కేసిఆర్ ఉత్తుత్తి హామీలే : ఈటల రాజేందర్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మితే గోస పడుతారని, తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, కేసీఆర్ ని ఓడగొట్టాలని ప్రతీ గ్రామం నిశ్చయంతో ఉందన్నార ఈటల రాజేందర్‌. వరదల వల్ల ముంపు గ్రామాల ప్రజలు సర్వస్వం కోల్పోయినట్లు, ముంపు బాధితుల నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్‌. 27 లక్షల క్యూసెక్కుల వరదలకు భారీగా నష్టం వచ్చిందని, వరదల సమయంలో అధికారులు విదేశాలకు వెళ్ళినట్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది సంభవించిందని విమర్శించారు ఈటల రాజేందర్‌.

Not occupied lands anywhere: Eatala Rajender

ఇతరుల మీద నెపం నెట్టి సీఎం తప్పించుకుంటున్నారన్న ఈటల రాజేందర్‌.. కేంద్రాన్ని సహాయం కోరామని, తప్పకుండా సహాయం చేస్తుందన్నారు. వరద సహయంపై కేసీఆర్ ఉత్తుత్తి హామీలు ఇచ్చారన్నారు ఈటల రాజేందర్‌. తానే ఇంజనీర్ అని అనుకొనే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ముంపునకు బాధ్యత వహించాలన్నారు. 139 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోస్తే, రూ. 3080 కోట్లు కరెంట్ బిల్లు వచ్చిందని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్‌. ఇప్పటికైనా ఇంజనీర్ల మాటలు విని కాళేశ్వరంలో 3వ టీఎంసీ నిర్ణయం సీఎం కేసిఆర్ మానుకోవాలని హితవు పలికారు ఈటల రాజేందర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news