BREAKING : మాజీ మంత్రి, వైసీపీ నేత కన్నుమూత..!

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఖలీల్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన 2019 ఫిబ్రవరిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బాషా అంత్యక్రియలు బుధవారం నాడు కడప జిల్లాలో జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news