BREAKING : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను అరెస్ట్ చేసిన సీబీఐ

-

BREAKING: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా కు ఊహించని షాక్ ఇచ్చింది CBI…. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. నిన్న అర్ధరాత్రి కొత్తపల్లి గీతను నిన్న అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ ఆమెను అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని చెల్లించని కేసులో కొత్తపల్లి గీతను సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.

విశ్వేశ్వర ఇన్ఫ్రా స్ట్రక్షర్ పేరుతో కొత్తపల్లి గీత దంపతులు 52 లక్షల రూపాయలు రుణంగా తీసుకున్నారు. ఈ ఋణం చెల్లించ లేనందున బ్యాంకు అధికారులు గీతా దంపతులపై ఇటీవల ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు అందినా.. వారు డబ్బులు కట్టలేదు. దీంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు గీతను ఇవాళ అరెస్టు చేశారు. కొత్తపల్లి గీతను అరెస్టు చేసి.. బెంగళూరుకు సిబిఐ అధికారులు తరలించారని సమాచారం అందుతుంది.  దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news