మహబూబ్‌నగర్‌ నుంచి మోదీ పోటీ చేయాలి : జితేందర్ రెడ్డి

-

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని కోరుతూ త్వరలో మోదీని కలిసి లేఖ ఇవ్వనున్నట్టు చెప్పారు.

మోదీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేస్తే రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను ఓడించి తీరుతామని కమలనాథులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, అర్వింద్‌, సోయం బాపూరావు బీజేపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉపఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ స్థానాలను మూడుకు పెంచుకుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news