ఫ్యాక్ట్ చెక్: సెలూన్ రంగంలోకి రిలయన్స్… నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.

వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు ఓ వార్త వైరల్ గా మారింది.

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ సెలూన్ వ్యాపారం లోకి అడుగుపెట్టే ఆలోచన లో ఉందని ఐటీ నివేదిక వచ్చిందని..చెన్నై కి చెందిన నాచురల్స్ సెలూన్ అండ్ స్పాలో దాదాపు 49 శాతం షేర్ ని కొంటుంది అని సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది.

మరి ఇది నిజమా కాదా అనేది చూద్దాం. సెలూన్ల వ్యాపారం లోకి రిలయన్స్‌ ప్రవేశిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. చెన్నై కి చెందిన నాచురల్స్ సెలూన్ అండ్ స్పాలో దాదాపు 49 శాతం షేర్ ని రిలయన్స్ రిటైల్ సంస్థ కొంటోంది అనడం లో నిజం లేదు కనుక అనవసరంగా ఇలాంటి వాటిని నమ్మద్దు.

 

Read more RELATED
Recommended to you

Latest news