కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో నలుగురు మృతి

-

ఉత్తరాఖండ్​లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వానలతో ఆ రాష్ట్ర ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. మరోవైపు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడడం వల్ల రాకపోకలు నిలిచిపోతున్నాయి.

చమోలీ జిల్లాలోని పైన్​గర్​ గ్రామంలో శనివారం ఉదయం ఒక్కసారి కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్​ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 ఏళ్ల బాలిక గాయాలతో బయటపడింది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news