సర్‌ప్రైజ్ ఇస్తాడనుకున్న మహేష్ బాబు షాకుల మీద షాకులిస్తున్నాడుగా …!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మంచి హిట్ సాధించాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సకంక్రాంతి బరిలో దిగి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే సెట్స్ మీదకి కొత్త సినిమాతో వెళతాడని సమ్మర్ కి ఆ సినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు. అందుకు కారణం వంశీపైడిపల్లి సరిలేరు తర్వాత సూపర్ స్టార్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్దంగా ఉండటమే. అయితే కథ మహేష్ బాబు కి సూటవదన్న ఆలోచనతో ఈ సినిమా నుండి డ్రాపయ్యారు.

SSMB 27: Mahesh Babu to play a spy in Vamshi Paidipally ...

ఇక ఈ సినిమా వదులుకున్న మహేష్ బాబు ఎఫ్ 3 తో రెడీ అవుతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అన్న టాక్ కూడా నడిచింది. తీరా చూస్తే ఇంకా ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలోనే ఉన్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడని ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని మే మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో నటించబోతున్నందుకు గాను మహేష్ బాబు రెమ్యూనరేషన్ 40 కోట్లని అన్నారు. అయితే ఆచార్య విషయంలో చెప్పుకున్నవన్ని వాస్తవాలే. కాని ప్రస్తుతం కరోనా కారణంగా పరిస్థితులు మారిపోవడంతో బడ్జెట్ పరిమితుల దృష్ట్యా మహేష్ బాబు కాకుండా రాం చరణ్ ప్రాజెక్ట్ లోకి వస్తున్నాడట.

 

Chiranjeevi REACTS into Mahesh Babu picking from Acharya; OPENS ...

ఇవన్ని ఫ్యాన్స్ కి షాక్ మీద షాక్ లుగా తగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుందన్న వార్త అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబినేషన్ లో నిర్మించబోయో సినిమాని 2020 ఆఖరున రిలీజ్ కూడా అనుకున్నారు. ప్రస్తుతానికి హీరోయిన్స్ గా వినిపిస్తున్న పేర్లు కీర్తి సురేష్, కియారా అద్వాని. అయితే ఈ సినిమాకి సంబంధిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పరశురాం మహేష్ బాబు సినిమా మే 31 న ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

 

Mahesh Babu's father Krishna Ghattamaneni heaps praise on Sarileru ...

అయితే కేవలం పూజా కార్యక్రమాలనే నిర్వహించనున్నారట. షూటింగ్ మొదలవడానికి మాత్రం మరో రెండునెలలు సమయం పడుతుందని సమాచారం. అందుకు కారణం మహేష్ బాబు స్క్రిప్ట్ లో చెప్పిన మార్పులు చేర్పులకి కాస్త సమయం పడుతుందట. ప్రస్తుతం పరశురాం ఆ పనిలోనే ఉన్నాడట. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ కి తెగ షాకులిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news