అన్నదాతలకు గుడ్ న్యూస్… అప్పుడే పీఎం కిసాన్‌ డబ్బులు.. మీ పేరుని ఇలా చెక్ చేసుకోండి..!

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ ని అందిస్తోంది. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు.

farmers

చాలా మంది ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ సంవత్సరం కూడా రైతులకి రూ. 6 వేలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా ఈ డబ్బులు ఇస్తున్నారు.

డీబీటీ ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా పది కోట్లు 12వ విడత తో అందుతాయి. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ డబ్బులు కోసం రైతులు చూస్తున్నారు. ఈ డబ్బులు జనవరి లో పడతాయని తెలుస్తోంది. జనవరి తొలినాళ్లలో 13వ విడత రైతుల ఖాతాల్లోకి పడచ్చట. ఇదిలా ఉంటే లబ్ధిదారుల జాబితా నుంచి తమ పేరు కూడా తొలగించబడిందా అనే సందేహం చాలా మందిలో వుంది. మీకూ ఆ సందేహం ఉంటే ఇలా చెక్ చెయ్యచ్చు.

ముందు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
ఇప్పుడు ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయండి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చెయ్యండి.
e-KYC, భూమి వివరాలు ఫిల్ చేసున్నాయో లేదో చూడండి.
పేరు కనిపించక పోతే మీకు డబ్బులు రావని అర్ధం.
భూమి రికార్డుల వెరిఫికేషన్, e-KYC చేయకుంటే ఈ డబ్బులు అందవు. కనుక వీటిని చూడండి. సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 కి సంప్రదించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news