బెంగళూరు డ్రగ్స్ కేసులో మరికొంతమంది ఎమ్మెల్యేలు

-

బెంగళూరు డ్రగ్స్ కేసులో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కలహర్ రెడ్డి ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తుకు పోలీసులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  కలహర్ రెడ్డి , రతన్ రెడ్డి నోరు విప్పితే మరి కొంత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు కలహర్ రెడ్డి  మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమేనని  శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారని అన్నారు. 

వ్యాపారవేత్తలు,  ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు ఉన్నారని ఆయన అన్నారు. పార్టీ లో ఏం జరిగిందో నాకు తెలియదన్న ఆయన ఆ పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారని అన్నారు.  బెంగుళూరు పోలీసుల ఎదుట హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చానని అన్నారు. ఆ పార్టీలో నేను డ్రగ్స్ తీసుకోలేదని, డ్రగ్స్ కు  నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news