బ్రేకింగ్:నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్

-

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఇతర దేశాలు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ నిమ్స్ లో చివరి దశలో ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చింది వైద్య బృందం. నిన్న 11 మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ నిమ్స్ వైద్య బృందం ఇచ్చింది. నేడు మరో పది మంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్టు నిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. దేశంలోని మొత్తం 12 ప్రాంతాల్లో క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news