BREAKING : వికారాబాద్​లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

-

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ధరూర్ మండలం కేరెల్లి బచారం బ్రిడ్జివద్ద ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడక్కడే చనిపోగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌ తరలిస్తుండగా.. మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఆటోడ్రైవర్ జమీల్‌, హేమ్లా, రవి, కిషన్, సోనీ బాయ్‌గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులని తెలిపారు. వారంతా కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news