విశాఖలో దారుణం.. 70 మంది అస్వస్థత..!

-

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మలకపాలెంలో కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా నిర్దారించారు. ఈ విషయమై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news