ఆదిలాబాద్ బేల కస్తూరిబా గాంధీ స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 16 మందికి అస్వస్థత

-

తెలంగాణలో ఇటీవల ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఘటనలే వినిపిస్తున్నాయి. అధికారులు పదేపదే హెచ్చరిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల పైకి తేస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని బేల కస్తూరిబా గాంధీ స్కూల్లో మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. 28 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్నవారిలో కాసేపటికి కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.

దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను దగ్గర్లో ఉన్న బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తరువాత రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థులు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news