కరోనాతో ఆరోగ్యశాఖ మాజీమంత్రి మృతి..!

-

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎవరికీ వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధాని, సీఎంలతో సహా అనేక మంది ప్రముఖులు చెప్తున్నారు. అయినాసరే సాధారణ ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా.. గోవా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సురేష్ అమోన్‌కర్ కరోనాతో మరణించారు.

గత వారం సురేష్ అమోన్‌కర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతన్ని మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. సురేష్ అమోన్‌కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించారు. మాజీమంత్రి సురేష్ అమోన్‌కర్ మృతి పట్ల గోవా ప్రతిపక్ష నాయకుడు దిగంబర్ కమాత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news