బెదిరించి రాజకీయాలు చేస్తున్నారు..త్వరలోనే పార్టీ మారడంపై నిర్ణయం తీసుకుంటా : జూపల్లి

-

కొల్లాపూర్ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి జూపల్లి. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. దాదాపు 30 సంవత్సరాల నుంచి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో అనుబంధం వుందన్నారు. తెలంగాణ ఏర్పాటు కొసం ఆనాడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీని విడిచి టిఆర్ఎస్ పార్టీ లో చేరానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే గా, మంత్రి గా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని వెల్లడించారు. త్వరలో ఏదైనా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు జూపల్లి కృష్ణారావు. నా భవిష్యత్తు ముఖ్యం కాదు నన్ను నమ్ముకున్న కొల్లాపూర్ ప్రజల భవిష్యత్ ముఖ్యం అని వెల్లడించారు. ఎవరు ఆందోళనల చెందవద్దు. రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. జూపల్లి అంటే సేవాభావంతో కూడిన రాజకీయం చేస్తాడు. కొంతమంది బెదిరింపు రాజకీయం చేస్తున్నారు. ఎవరు భయపడొద్దని సూచించారని జూపల్లి కృష్ణారావు. కాగా జూపల్లి కృష్ణారావు బిజేపి లోకి వెలతారని.. రెండు రోజుల నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news