టీడీపీలో విషాదం… నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే మృతి

-

తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. గత ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి… ఇవాళ ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో క్రియాశీల నేతగా ఉన్న శ్రీధర్కృష్ణారెడ్డి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా.. ఆయన ఆ పని చేశారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున అనిల్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. అయితే 2009 సంవత్సరంలో అనిల్ కుమార్ యాదవ్ పై 90 ఓట్ల మెజారిటీతో ముంగమూరు శ్రీధర్కృష్ణారెడ్డి గెలుపొందారు. అయితే 2014 సంవత్సరం లో టిడిపిలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ 2014 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ పై 19 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఇక ఇక కృష్ణ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news