Breaking : కోట్‌పల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్ళి నలుగురు మృతి

-

పండగపూట వికారాబాద్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు యువకులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. పండగ రోజు సరదాగా గడిపేందుకు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అయితే.. ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు దిగి ఒడ్డున ఈదుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు నలుగురు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మృతదేహాలను వెలికి తీశారు.

మృతులను పూడూరు మండలం మన్నెగూడకు చెందిన లోకేశ్, జగదీశ్, వెంకటేశ్‌, రాజేశ్‌లుగా గుర్తించారు. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news