ఈ పండ్లలో షుగర్ ఎక్కువగా ఉంటుంది.. లిమిట్ గా తీసుకుంటే మంచిది..!

-

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది రెగ్యులర్ గా నచ్చిన పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లలో పంచదార ఎక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

 

సాధారణంగా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే కొన్ని పండ్లలో మాత్రం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పండ్లకు దూరంగా ఉంటే మంచిది లేదు అంటే లిమిట్ గా తీసుకోవాలి. మరి వాటి కోసం తెలుసుకుని ఈ పండ్లకి దూరంగా ఉండాలి. లేదంటే తగ్గించాలి.

ద్రాక్ష పళ్ళు:

ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ద్రాక్షపండ్లలో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి ద్రాక్ష పండ్లను లిమిట్ గా తీసుకోవడం మంచిది.

లిచీ:

లిచీ లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల లక్షీ పండ్లలో 15.2 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి దీనిని కూడా లిమిట్ గా తీసుకోవాలి.

సపోటా:

సపోటా లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. 60 గ్రాముల సపోటా పండ్లలో 15 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి సపోటాను కూడా ఎక్కువగా తీసుకోవద్దు.

మామిడి పండ్లు:

మామిడి పండ్లు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. వేసవికాలంలో మనకు ఎక్కువ మామిడిపండ్లు దొరుకుతాయి. వందగ్రాముల మామిడి పండ్లలో 14 గ్రాములు షుగర్ ఉంటుంది. కనుక వీటిని కూడా లిమిట్ గా తీసుకుంటే మంచిది.

అరటి పండ్లు:

అరటి పండ్ల వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ఇందులో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండ్లలో12 గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి ఈ పండ్లను కూడా లిమిట్ గా తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news