కేసీఆర్ పిలుపు ఇస్తే భయమేంటో చూపించే వాళ్లం… శివరాజ్ సింగ్ చౌహన్ కు మంత్రి గంగుల వార్నింగ్.

-

బీజేపీ నేత మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. నిన్న శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ భయపడుతున్నారని.. ఇంతవరకు పిరికి సీఎంను చూడ లేదని అని విమర్శించారు.

తాజాగా ఈ విమర్శలపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ పిలుపు ఇస్తే భయమెంటో శివరాజ్ సింగ్ చౌహన్ కు చూపించేవాళ్లమని గంగులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేం అనుకుంటే నువ్వు ఫ్లైట్ కూడా దిగకపోయేవాడివని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చీల్చి, ఎమ్మెల్యేలను కొనుక్కుని ముఖ్యమంత్రివి అయ్యావని గంగుల కమలాకర్ విమర్శించారు. బీజేపీ నేతలకు మతి భ్రమించిందని ఆయన అన్నారు. నీ రాష్ట్రంలో ఎంత మందికి ఉపాధి కల్పించావని ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్ ప్రజలు ఉపాధి దొరక్క తెలంగాణకు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారని అన్నారు. మధ్య ప్రదేశ్ ప్రజల్ని కూడా తెలంగాణ కడుపులో పెట్టుకుంటుందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా మధ్యప్రదేశ్ వెనకబడిందని విమర్శించారు. ఆరోగ్యం విషయంలో అధ్వానంగా ఉందని.. అలాంటి రాష్ట్ర సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని అన్నారు. ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news