గంగూలీ భార్య‌కు నెగిటివ్ కూతురికి పాజిటివ్..!

-

కరోనా కేసులు మ‌ళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా వ్యాప్తి పెరిగిపోయింది. తాజాగా నిన్న ముంబైలో 8వేల కేసులు న‌మోద‌య్యాయి. 20వేల మార్క్ కు చేర‌కుంటే అక్క‌డ లాక్ డౌన్ విధించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటూ మ‌ళ్లీ సెల‌బ్రెటీలు రాజ‌కీయ ప్ర‌ముఖులు సెల‌బ్రెటీలు క‌రోనా భారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

దాంతో ఆయ‌న భార్య డోనా మ‌రియు కూతురు స‌న కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. కాగా వారిలో భార్య‌కు నెగిటివ్ రాగా కూతురు స‌న గంగూలీకి పాజిటివ్ గా నిర్థార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు వైద్యులు నిర్థారించారు. ఇక ఇటీవ‌లే గంగూలీ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. గంగూలీకి స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టం తో ఆయ‌న నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది దాంతో ఆయ‌న చికిత్స తీసుకుని ఇంటికి చేర‌కున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news