బిగ్ బ్రేకింగ్ : కర్నూలు జిల్లాలో విషవాయువు లీక్..!

-

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో విశాఖ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నడుస్తున్న వారు నడుస్తూనే.. నిద్రపోతున్న వారు నిద్రలోనే కుప్పకూలిపోయారు. ఈ దృశ్యాలు చూసి కంటతడి పెట్టని కన్ను లేదు. అయితే ఈ తీవ్ర విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేలుకోకముందే.. అలాంటి ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హడలెత్తిపోతున్నాడు.

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కంపెనీలో  విషవాయువు లీక్‌ అయింది. అమ్మోనియా నుంచి సీవో2 తయారు చేసే గ్యాస్‌ లీక్ కావడంతో దాన్ని పీల్చిన ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషవాయువు భయంతో కర్మాగారం నుంచి కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి అంబులెన్సులు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news