BREAKING : మహేష్ బాబు ఇంటికి బాలయ్య..ఫోటోలు వైరల్

-

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ తల్లి ఇందిరాదేవి (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత నెలలో అంటే సెప్టెంబర్ 28వ తేదీన హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్‌స్టార్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

అయితే.. శనివారం ఆమె దశదిన కర్మకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. దీనికి నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్, అడివి శేష్ తో సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఇందిరాదేవి చిత్రపటానికి పుష్పాలు అర్పించి, అంజలి ఘటించారు.

Read more RELATED
Recommended to you

Latest news