ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

-

హైదరాబాద్ : నేడు 8వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసారు శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ కార్యదర్శి డా.వి. నరసింహాచార్యులు పాల్గొన్నారు.

ఇక అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం బిజేపి నేత విజయశాంతి ట్వీట్ చేశారు. “నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, వేలాదిమంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి పథంలో అగ్రస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ… తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news