నిన్న తగ్గి.. నేడు షాక్ ఇచ్చిన బంగారం.. వెండి మాత్రం…!

-

హైదరాబాద్: బంగారం ధర నిన్న తగ్గి బుధవారం షాక్ ఇచ్చింది. ఈ రోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర మాత్రం పెరగకుండా కాస్త ఊరటనిచ్చింది. మంగళవారంతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. హైదరాబాద్‌లో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,100గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48.110గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక వెండి ధరల విషయానికొస్తే ఈ రోజు స్వల్ప ఊరట లభించింది. కేజీ వెండిపై రూ.100 తగ్గింది. వెండి ధర కేజీ రూ. 73.000 ఉంది. మంగళవారం (నిన్న) కేజీ వెండి రూ. 73,100గా విక్రయాలు జరిగాయి.

దేశంలో బంగారు నగల కొనుగోళ్లు ఒక్కసారిగా భారీగా పెరగడంతో ధర కొద్దిగా పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ధర తగ్గే అవకాశాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇండియాలో కరోనా పెరిగితేనే ధర పెరుగుతుందనీ కరోనా కేసులు తగ్గుతూ ఉంటే ధర కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

నేటి బంగారం ధర..

గత పది రోజుల్లో హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

గత పది రోజుల్లో హైదరాబాద్‌లో వెండి ధరలు ఇలా ఉన్నాయ:

 

Read more RELATED
Recommended to you

Latest news