ఏపీ పెన్షర్లకు శుభవార్త..వారి ఖాతాల్లో రూ.1537.68 కోట్లు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పెన్షనర్లకు జగన్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని ఉప ముఖ్య మంత్రి , పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు ప్రకటించారు.

60.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1537.68 కోట్లు విడుదల చేసామని ఆయన వెల్లడించారు. తెల్లవారు జాము నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారని స్పష్టం చేశారు.

ఉదయం 08.00 గంటల వరకు 30.69 శాతం పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి బుడి ముత్యాల నాయుడు. 18.57 లక్షల మందికి రూ.471.24 కోట్లు అందచేసినట్లు చెప్పారు. పెన్షన్‌ రాని వారు స్థానిక వాలంటీర్లను కలవాలని కోరారు మంత్రి బుడి ముత్యాల నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news