రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నవరాత్రి స్పెషల్…!

-

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నవరాత్రి సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్ ని తీసుకు రావడం జరిగింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. స్పెషల్ ప్యాకేజీలను ప్రయాణికుల కోసం తీసుకు వచ్చారు. బంగాల్‌లో దుర్గా పూజ ని బ్రహ్మాండంగా చేస్తారు.

దీనితో ఈశాన్య రాష్ట్రాల వైపు రైలు ప్రయాణం చేసేవారికి ఓ చక్కటి అవకాశం కల్పించారు. బంగాలీ వంటకాలను ప్రయాణికులు తినచ్చు. స్పెషల్ మెనూను తీసుకు వచ్చింది. హౌరా, సెల్డా, అసనోల్ మీదుగా ప్రయాణించే ట్రైన్లలో ఈ ప్రత్యేక వంటకాలతో వుండే మెనూ అందించనున్నారు.

ఇక ఫుడ్ ని ఎలా ఆర్డర్ చెయ్యాలనేది చూస్తే.. ప్యాసింజర్లు నేరుగా 1323 నంబర్‌కు డయల్ చేసి ఫుడ్ ని పొందొచ్చు. 400 స్టేషన్ల వద్ద ఐఆర్‌సీటీసీ దీన్ని కల్పిస్తోంది. దీని స్టార్టింగ్ ప్రైస్ రూ.99 గా ఉంది. మటన్ థాలీ, పూరి, పులావ్, ఆలూ పోస్టో, చికెన్, ఫిష్ థాలీ వంటి మీల్స్ పాసెంజర్స్ పొందొచ్చు.

అలానే రుచిగా వుండే ఫిష్ ఫ్రై, కోల్‌కతా బిర్యానీ, రసగుల్లా వగైరా ఆహార పదార్దాలను దుర్గా పూజ మెనూ లో ఉన్నాయని చెప్పింది ఐఆర్‌సీటీసీ. అంతే కాక సబుదానా కిచ్డీ, పరాటాలతో పనీర్ మఖ్‌మాలీ, కోఫ్తా కర్రీ వంటివి కూడా నవరాత్రి స్పెషల్ కింద పొందొచ్చు. ఆలూ చాప్, సబుదానా టిక్కీ వంటివి నవరాత్రి స్పెషల్ స్టార్టర్స్ మెనూలో ఉంటాయి. దీనితో ఈశాన్య రాష్ట్రాల వైపు రైలు ప్రయాణం చేసేవారు ఈ ఫుడ్ ని పొందొచ్చు అది కూడా ప్యాసింజర్లు నేరుగా 1323 నంబర్‌కు డయల్ చేసి.

 

Read more RELATED
Recommended to you

Latest news