వాటే స్కీమ్… రూ.10 వేలతో రూ.2 లక్షలు…!

-

వివిధ రకాల పాలసీలని ఎల్‌ఐసీ అందిస్తోంది. వీటిలో మైక్రో బచత్ ప్లాన్ ఒకటి. దీని ద్వారా మెచ్యూరిటీ సమయం లో డబ్బులు వస్తాయి. అదే ఒకవేళ ముందే చనిపోతే కుటుంబ సభ్యులకు డబ్బులు లభిస్తాయి. ఈ ప్లాన్ తక్కువ ఆదాయం కలిగిన వారికి బాగుంటుంది. ఇక ఈ మైక్రో బచత్ ప్లాన్ గురించి పూర్తిగా ఇక్కడ చూద్దాం.

మైక్రో బచత్ ప్లాన్ నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్. దీని వలన సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఒక పక్క రక్షణ ఉంటుంది. అలానే మరో పక్క మంచి రాబడి కూడా ఉంటుంది. ఇలా మీరు రెండు బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. ఈ పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు.

తక్కువ ఆదాయం కలిగిన వారు లక్ష్యంగా ఎల్‌ఐసీ ఈ పాలసీ తీసుకు వచ్చింది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి డబ్బులు వస్తాయి. పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

ఇక ఎంత డబ్బులు వస్తాయి అనే విషయానికి వస్తే… పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు ఉంటుంది. 55 ఏళ్ల వయసు లోపు ఉన్న వారంతా పాలసీ తీసుకోవడానికి అర్హులే. 25 ఏళ్ల వయసు కలిగిన వారు రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి. దీనితో రెండు లక్షలు కంటే ఎక్కువ వస్తుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news