షాకింగ్ : కోటి రూపాయల విలువగల పాము విషం సీజ్ !

-

ఒడిశా రాజధాని భువనేశ్వర్ అటవీ శాఖ అధికారులు శనివారం పాము విషం స్మగ్లింగ్ రాకెట్టును ఛేదించారు. ఒక మహిళ తో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక లీటరు పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అటవీ అధికారి అశోక్ మిశ్రా తెలిపారు.

“మేము బార్గర్ నుండి సేకరించిన ఒక లీటరు పాము విషం మరియు ఐదు మిల్లీలీటర్ల ఐదు వయల్స్ స్వాధీనం చేసుకున్నాము. బాలసోర్ కు చెందిన ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ₹ 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ₹ 1 కోట్లకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒక లీటరు విషాన్ని సేకరించడానికి 200 కోబ్రాస్ అవసరమని మిశ్రా తెలియజేశారు. “ఈ కేసులో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం సెక్షన్ 9, 39, 44, 49 మరియు 51 కింద అరెస్టు చేశారు, వారిని రేపు కోర్టుకు పంపిస్తారు” అని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news