ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం!

-

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటన బుధవారం ఉదయం నిజామాబాద్‌లోని ఫారెస్టు ఆఫీస్ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ సలహాదారుగానే కాకుండా ఆయన ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అర్బన్ ఇంచార్జిగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఫారెస్టు కార్యాలయం వెళ్తుండగా అనుకోకుండా ఫారెస్టు ఆఫీసు ముందే ఆయన కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో కాన్వొయ్‌లోని మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మాత్రం ఏమీ కాలేదు.ఆయన క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాన్వాయ్ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. మరోవైపు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా? అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. కాన్వాయ్ ప్రమాదం జరిగిన సమయంలో షబ్బీర్ అలీతో పాటు మరికొందరు నేతలు కూడా ఆయనతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news